Telangana | తెలంగాణలో పాఠశాలల పనివేళలను మారుస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం పాఠశాలలు ఉదయం 9 గంటలకు మొదలవుతున్నాయి. దీన్ని ప్రభుత్వం 9.30 గంటలకి విద్యాశాఖ మారుస్తూ నిర్ణయం తీసుకున్నది. ప్రాథమిక పాఠశాలల సమయం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.15వరకు మార్చింది. ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 వరకు మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పనివేళ్లల్లో మార్పులు చేసినట్లు వెల్లడించింది. ఈ పని వేళలు జంట నగరాలకు మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వర్తించనున్నదని ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలో అధిక వర్షాలు కురవడంతో ఇప్పటికే ప్రభుత్వం పాఠశాలలకు కలిపి మూడు రోజులు సెలవులు ఇచ్చింది. ఆదివారంతో కలిసి నాలుగు రోజులు ఇచ్చినట్లయ్యింది.