రంగారెడ్డి: జిల్లాలోని చేవెళ్ల మండలం గొల్లపల్లి వద్ద టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. గొల్లపల్లి స్టేజి వద్ద స్కూలు బస్సు కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులను ఢీకొట్టిన టిప్పర్ అదుపుతప్పి ఇంట్లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో రుత్విక్ అనే విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. టిప్పర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.