హైదరాబాద్: కాటేదాన్లో దారుణం జరిగింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన అధ్యాపకుడే విద్యార్థినులపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. వికృత చేష్టలకు పాల్పడ్డాడు. విద్యార్థినులు ఈ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో.. వారు స్కూల్కు వచ్చి ప్రిన్సిపాల్ను నిలదీశారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. కాటేదాన్లోని రాకేష్ విద్యా నికేతన్ స్కూల్లో గుర్రం శంకర్ అనే వ్యక్తి ప్రిన్సిపాల్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో 10వ తరగతి విద్యార్థినులతో అతను అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. వారి ముందు వికృత చేష్టలకు పాల్పడుతున్నాడు. అయితే ప్రిన్సిపాల్ తీరుతో విసిపోయిన పిల్లలు ఈ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు.
దాంతో విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ప్రిన్సిపాల్ను నిలదీశారు. ప్రిన్సిపాల్ దురుసుగా సమాధానం చెప్పడంతో అతనిపై షీ టీమ్స్కు, మైలార్దేవ్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.