హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): విద్యారంగంలో రాష్ట్రం సాధించిన విజయాలను చాటేలా దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 20న విద్యా దినోత్సవాన్ని గ్రామం, పాఠశాల, జిల్లా స్థాయిల్లో నిర్వహిస్తారు. విద్యారంగంలో గత దశాబ్దకాలంలో సాధించిన ప్రగతిపై గ్రామాల్లో వీధినాటకాలు, తెలంగాణ ప్రగతిని చాటేలా ఫ్లాష్మాబ్లు నిర్వహిస్తారు. పదో తరగతిలో 10 జీపీఏ సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, పాఠశాల అభివృద్ధికి కృషిచేసిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, హెచ్ఎంలు, టీచర్లను సన్మానిస్తారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు పంపిణీ చేస్తారు. విద్యార్థులకు పలు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. టీచర్లకు 19,800 ట్యాబ్లు పంపిణీచేస్తారు. 83 కొత్త మండల రీసోర్స్సెంటర్లు, 8,145 డిజిటల్ క్లాస్రూములు, 10వేల రీడింగ్ కార్నర్లను ప్రారంభిస్తారు.