Group-2 | హైదరాబాద్ : ఈ నెల 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో గ్రూప్-2 పరీక్షలకు కేటాయించిన పాఠశాలలకు 29, 30 తేదీల్లో సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీ దేవసేన.. జిల్లా విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
783 గ్రూప్-2 ఉద్యోగాలకు 5,51,943 మంది దరఖాస్తు చేస్తున్నారు. రెండు రోజుల్లో నాలుగు పేపర్లకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు వారం రోజుల ముందు వెబ్సైట్లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు. గ్రూప్-2 పరీక్షల నిర్వహణపై ఇప్పటికే జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో టీఎస్పీఎస్సీ అధికారులు పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. గ్రూప్-2 ఎగ్జామ్స్ను పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటుంది టీఎస్పీఎస్సీ.