హైదరాబాద్ : నగరంలో దారుణం చోటు చేసుకుంది. తండ్రితో కలిసి అన్నను స్కూల్ బస్(School bus) ఎక్కించేందుకు వచ్చిన చెల్లెలు(Child died) అంతలోనే మృత్యువాత పడటం పలువురుని కంటతడిపెట్టించింది. వివరాల్లోకి వెళ్తే.. హబ్సిగూడ(Habsiguda) రవీంద్రనగర్లో జాన్సన్ గ్రామర్ స్కూల్ బస్సు టైర్ కింద పడి రెండేళ్ల చిన్నారని మృతి చెందింది. బస్ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడుపడంతో స్కిడ్ అయి.. బస్ టైర్ కింద పడి మృతి చెందిందని స్థానికులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అప్పటివరకు కండ్లముందే ముద్దు ముద్దు మాటలతో అల్లరి చేస్తూ ఆ కుటుంబంలో ఆనందాలు నింపిన చిన్నారి.. అంతలోనే విగతజీవిగా మారడంతో తల్లిందడ్రుల రోదనలు మిన్నంటాయి.