హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): పాఠశాల విద్యలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్ల మధ్య వేతన వ్యత్యాసాన్ని తగ్గించాలని సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ (ఎస్జీటీయూ) పీఆర్సీ కమిటీని కోరింది. ఈ రెండు పోస్టుల మధ్య రూ.13 వేల వేతన వ్యత్యాసం ఉన్నదని, దీన్ని సవరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం పీఆర్సీ కమిటీ చైర్మన్ను కలిసి ప్రతిపాదనలు సమర్పించారు. ఎస్జీటీల వేతన స్కేల్ రూ.71,500 నుంచి రూ.2,20,770గా ఉండాలని కోరారు. పీఆర్సీ కమిటీ చైర్మన్ను కలిసినవారిలో ఎస్జీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు కరివేద మహిపాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి అరికెల వెంకటేశం తదితరులున్నారు.