21, 22 తేదీల్లో ఎంఆర్యూసెట్: చాన్సలర్
మేడ్చల్ రూరల్, ఆగస్టు 16: పేద విద్యార్థులకు ఉపకారవేతనాలు అందజేయాలని సంకల్పించినట్టు మల్లారెడ్డి విశ్వవిద్యాలయం చాన్సలర్ డీఎన్ రెడ్డి, వైస్ చాన్సలర్ వీఎస్కే రెడ్డి తెలిపారు. ఇందుకు యాజమాన్యం రూ.5 కోట్లు కేటాయించిందని చెప్పారు. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని వర్సిటీలో సోమవా రం వారు మాట్లాడుతూ.. ఈ నెల 21, 22 తేదీల్లో నాలుగు విడతల్లో ఎంఆర్యూసెట్ పేరుతో ఉపకార వేతన పరీక్ష నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ పరీక్షలో ప్రతిభ ఆధారంగా రూ.లక్ష వరకు ఉపకార వేతనం అందజేయనున్నట్టు వివరించారు. 20వ తేదీ సాయంత్రం వరకు ఎలాంటి రుసుం లేకుండామల్లారెడ్డి యూనివర్సిటీ.ఏసీ.ఇన్లో ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎక్కడి నుంచైనా పరీక్ష రాయవచ్చని, పీసీ లేకపోతే సెల్ఫోన్లో సైతం పరీక్ష రాయవచ్చని, 90 నిమిషాలు, 90 ప్రశ్నలు ఉంటాయని వివరించారు. ఇంటర్లో 60 శాతం మార్కులు ఉన్న విద్యార్థులు అర్హులని తెలిపారు. సమావేశంలో అడ్మిషన్స్ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి, అగ్రికల్చర్ డీన్ రాజారెడ్డి, మేనేజ్మెంట్ సభ్యుడు ప్రవీణ్రెడ్డి పాల్గొన్నారు.