హైదరాబాద్ : తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయ స్థాయి కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. దావోస్ వేదికగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సవివరంగా తెలుపుతున్నారు. ఈ క్రమంలో పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు పెట్టుబడులు పెడుతామని ప్రకటించగా, తాజాగా మరో కంపెనీ ముందుకొచ్చింది.
రాష్ట్రంలో మరో యూనిట్ను ఏర్పాటు చేసేందుకు ష్నైడర్ ఎలక్ట్రిక్ కంపెనీ సిద్ధమైంది. దావోస్లో మంత్రి కేటీఆర్తో ష్నైడర్ కంపెనీ ప్రతినిధి చర్చించి ఈ విషయాన్ని ప్రకటించారు. కంపెనీ విస్తరణ ప్రణాళికలపై ష్నైడర్ కంపెనీ ప్రతినిధులు కేటీఆర్తో చర్చించారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రెండో యూనిట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ష్నైడర్ కంపెనీ ప్రతినిధులకు కేటీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Schneider Electric is a global leader in digital transformation of energy management & automation with presence in over 100 countries
As Telangana continues to grow, firms like Schneider Electric will play a crucial role in meeting energy mgmt & automation needs of industries
— KTR (@KTRTRS) May 25, 2022