నిజామాబాద్: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై (MP Aravind) అట్రాసిటీ కేసు నమోదయింది. నగరంలోని శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన సామాజిక కార్యకర్త బంగారు సాయి ఫిర్యాదు మేరకు ఐదో టౌన్ పోలీసులు అరవింద్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
గతేడాది అక్టోబర్ 31న హైదరాబాద్లోని చంచల్గూడ జైలు సమీపంలో ఎంపీ అరవింద్ మీడియాతో మాట్లాడుతూ అట్రాసిటీ చట్టాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడని, దళిత సమాజాన్ని కించపరిచేలా మాట్లాడిన ఎంపీని చట్టప్రకారం శిక్షించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధ్యతగల పదవిలో ఉన్న వ్యక్తులు చట్టాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం తగదని సాయి వెల్లడించారు.