హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ నాయకురాలు డీకే అరుణ కుమార్తె డీకే శృతిరెడ్డి, వినోద్ కైలాస్పై ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. కోర్టు ఆదేశాలతో డీకే శృతిరెడ్డి, వినోద్ కైలాస్పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్లో ఇంటి కంపౌండ్ వాల్ నిర్మాణ పనుల విషయంలో శృతిరెడ్డి తమను అసభ్యకరమైన పదజాలంతో దూషించారని, బెదిరింపులకు గురి చేశారని ఎలీషా బాబు అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు శృతిరెడ్డిపై ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. బాధితుడు ఎలీషా బాబు కోర్టుకు, పోలీసులకు పక్కా ఆధారాలు సమర్పించాడు.