న్యూఢిల్లీ: జడ్జీల నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం పంపే సిఫార్సులను కేంద్రం అధికారికంగా ప్రకటించడానికి నిర్దేశిత కాలపరిమితి నిర్ణయించాలంటూ దాఖలైన పిటిషన్పై తమకు సహకరించాలని సుప్రీంకోర్టు శుక్రవారం అటార్నీ జనరల్ను కోరింది.
పిటిషన్పై తదుపరి విచారణను సెప్టెంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది. కొలీజియం సిఫార్సులపై నిర్ణయం తీసుకోవడంలో కేంద్రం చేస్తున్న జాప్యంపై ఓ న్యాయవాది పిల్ దాఖలు చేశారు. కొలీజియం సిఫార్సులను నోటిఫై చేయడానికి నిర్దేశిత కాలపరిమితి లేకపోవడంతో ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని, అది న్యాయవ్యవస్థ స్వతంత్రతను అణగదొక్కడమేనని అందులో పేర్కొన్నారు.