మేడిపల్లి, నవంబర్ 21: సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి దేశానికే దిక్సూచిలా మారిందని, ఎనిమిదేండ్లలో ఎవరూ ఊహించని మార్పులు జరిగాయని ఎస్సీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా భీమారం మండలకేంద్రంలో కొత్తగా నిర్మించిన తాసిల్దార్ కార్యాలయాన్ని సోమవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబుతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ యూసుఫ్ను శాలువాతో సన్మానించారు.
అనంతరం 32 మహిళా సంఘాలకు రూ. 3.50 కోట్ల రుణాలను పంపిణీ చేశారు. మేడిపల్లి మండలానికి చెందిన ముగ్గురు దివ్యాంగులకు స్కూటీలను, 20 మంది దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిళ్లను, దళితబంధు కింద కొనుగోలు చేసిన రూ. 20 లక్షల విలువైన డీసీఎం వ్యాన్ను దాసరి శంకర్, మునుగూరి శంకర్కు అందజేశారు. ధరణితో రైతుల భూములకు రక్షణ కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మంత్రి కొప్పుల పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో రెవె న్యూ సదస్సులు నిర్వహించి భూముల సమస్యల పరిష్కారానికి సీఎం కేసిఆర్ త్వరలో నిర్ణ యం తీసుకోనున్నట్టు తెలిపారు. బోయినపల్లి వినోద్కుమార్ కాళేశ్వరం రిజర్వాయర్ ద్వారా మేడిపల్లి, కథలాపూర్ మండలాల్లోని ప్రతి గ్రామానికి నీళ్లు అందించేందుకు రూపకల్పన చేసినట్టు బోయినపల్లి పేర్కొన్నారు.