హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ ఆంబేద్కర్కు తెలంగాణలో సముచిత గౌరవం దక్కిందని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఆర్టికల్ 3ను రాజ్యాంగంలో పొందుపర్చి తెలంగాణలాంటి ప్రాంతాలకు అంబేద్కర్ ఎంతో న్యాయం చేశారని తెలిపారు. ఆ ఆర్టికల్ ద్వారా తెలంగాణతోపాటు ఇతర రాష్ర్టాలు ఏర్పడ్డా.. ఎవరూ అంబేద్కర్ గొప్పతనాన్ని గుర్తించలేదని పేర్కొన్నారు.
కానీ, సీఎం కేసీఆర్ అంబేద్కర్కు సముచితమైన గౌరవం కల్పించారని చెప్పారు. తెలంగాణలో ఎస్సీ బిడ్డలకోసం పెద్ద సంఖ్యలో ఎస్సీ గురుకులాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. మార్కెట్ కమిటీల్లో కూడా రిజర్వేషన్లు కల్పించామని వెల్లడించారు. దళిత బంధు ద్వారా రాష్ట్రంలో ఇప్పటికే 40 వేల కుటుంబాలకు రూ.4 వేల కోట్లు అందించినట్టు తెలిపారు. ఈ పథకాన్ని దేశమంతా అమలు చేయాలని దళితులు కోరుతున్నారని చెప్పారు. దేశం మొత్తం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకొంటున్నదని తెలిపారు.