హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఎస్సీ అభివృద్ధి, సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఎస్సీ గురుకులాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మంత్రి గురువారం హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని సంక్షేమభవన్లో ప్రోత్సాహకాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోనే ఎకడా లేనివిధంగా షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు కేజీ టు పీజీ ఉచిత విద్యను అందించేందుకు ఎస్సీ గురుకులాల సొసైటీని ఏర్పాటు చేశామని చెప్పారు.
ఎస్సీ విద్యార్థుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నదని పేర్కొన్నారు. ఈ సొసైటీ ద్వారా ప్రతి ఏటా 300 మంది విద్యార్థులకు లాంగ్టర్మ్ నీట్ కోచింగ్ ఇస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ 2014 నుంచి ఇప్పటివరకు మొత్తం 1,335 మంది విద్యార్థులు వివిధ క్యాటగిరీల్లో అడ్మిషన్లు పొంది విజయాలు సాధించారని చెప్పారు. అనంతరం ఐఐటీ విద్యార్థులకు రూ.50,000, ల్యాప్ట్యాప్, నీట్, ట్రిఫుల్ ఐటీ, జీఎఫ్టీఐఎస్ విద్యార్థులకు రూ.40,000, ల్యాప్టాప్, ఎంబీబీఎస్ విద్యార్థులకు రూ.50,000, బీడీఎస్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు రూ. 40,000 చొప్పున చెక్కులను పారితోషికంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ అందజేశారు.