ఢిల్లీ: బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) సుప్రీంకోర్టు సూచించింది. దీనిపై ఈడీకీ నోటీసులు జారీచేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తన అరెస్టు చట్టవిరుద్ధమంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈడీ వ్యవహరించిన తీరు, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తమను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయని కవిత తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టు దృస్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో ఒక సాక్షిగా, మరోసారి నిందితురాలిగా పిలిచారని తెలిపారు.
కవితకు వ్యతిరేకంగా ఒక్క బలమైన సాక్ష్యం కూడా లేదని, అప్రూపర్ ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా కేసు దర్యాప్తు కొనసాగుతున్నదని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ప్రస్తుతానికి తాము కేసు మెరిట్స్లోకి వెళ్లడం లేదని స్పష్టం చ ఏసింది. ఇందులో తాము బెయిల్ ఇవ్వలేమని, మొదట కింది కోర్టును ఆశ్రయించాల్సిందేనని తెలిపింది. ఆ స్వేచ్ఛ పిటిషనర్కు ఉందన్న ధర్మాసనం.. త్వరితగతిన కేసు విచారణ చేపట్టాలని ట్రయల్ కోర్టుకు సూచించింది. ఈ పిటిషన్లో రాజ్యాంగ ఉల్లంఘనకు సంబంధించిన అంశాలను లేవనెత్తినందున.. దీన్ని ఇప్పటికే దాఖలైన విజయ్ మదన్ లాల్ కేసుకు జతచేస్తున్నట్లు వెల్లడించింది. రాజ్యాంగపరమైన అంశాలపై ఈడీకి నోటీసులు జారీచేసింది. ఆరువారాల్లోగా దీనిపై సమాధానం చెప్పాలని, ఆ తర్వాత మరో రెండు వారాల్లో రిజాయిండర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది.