వరంగల్: వరంగల్ పట్టణంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో ఉన్న ఏటీఎం చోరీకి విఫలయత్నం జరిగింది. రైల్వేస్టేషన్ ఆవరణలోని భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) ఏటీఎంలో దొంగతనం చేయడానికి ఓ యువకుడు యత్నించాడు. ఈ క్రమంలో ఏటీఎం మిషన్ను ధ్వంసం చేశాడు. అయితే అదేసమయంలో అక్కడికి వచ్చిన రైల్వే పోలీసులు అతడిని పట్టుకున్నారు. అతడిని బీహార్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అనంతరం వరంగల్ ఇంతెజార్గంజ్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.