హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (shamshabad airport)లో అధికారులు అక్రమంగా తరలిస్తున్న విదేశీ కరెన్సీని అధికారులు పట్టుకున్నారు. అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించి, దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. 33వేల సౌదీ అరేబియా రియాల్స్ను పట్టుకోగా.. వాటి విలువ భారతీయ కరెన్సీలో రూ.6.35లక్షలు ఉంటుందని అధికారులు వివరించారు. సదరు వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.