హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): ఎండీగా సీహెచ్పీ సత్యనారాయణరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఎండీ (ఎఫ్ఏసీ)గా ఉన్న ఐఏఎస్ హన్మంతు కొండిబా స్థానంలో ఆయనను నియమించారు.
కో-ఆపరేటివ్ జాయింట్ రిజిస్ట్రార్ అయినటువంటి సత్యనారాయణరెడ్డి ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ మంత్రి వద్ద పీఎస్గా విధులు నిర్వర్తిస్తున్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గిర్మాపూర్ గ్రామానికి చెందిన ఆయన గతంలో మెదక్, సిద్దిపేట డీఆర్డీఏ పీడీగా, కేసీఆర్ కిట్ ప్రత్యేక అధికారిగా పనిచేశారు.