హైదరాబాద్ : వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ పార్టీ మహాధర్నా చేపట్టింది. ఈ మహాధర్నాలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన శరీరంపై వడ్ల కంకులతో అలంకరణ చేసుకున్నారు. భుజంపై నాగలి పెట్టుకుని.. వడ్ల కంకులతో నిరసన వ్యక్తం చేశారు.
ఇక ఈ ధర్నాలో కేంద్రం వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రైతుబంధు సమితి అధ్యక్షులు, రైతులు ప్లకార్డులు ప్రదర్శించారు. మహాధర్నా మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది.