హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): కార్నర్ మీటింగుల్లో జనం కనబడక కుదేలైన బీజేపీ నేతలు బీఆర్ఎస్ను బద్నాం చేసేందుకే పేపర్ లీకేజీ కుట్రకు పాల్పడ్డారని సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ విమర్శించా రు. ఎంత చేసినా రాష్ట్రంలో బీజేపీకి జనాదరణ రావడం లేదని గ్రహించే కుట్రకు తెరలేపిందని ఆరోపించారు. టీఎస్పీఎస్సీ లీకేజీ సామ్కు కిషన్రెడ్డి, బండి, అరవింద్ కుట్రకు తెరలేపారని గురువారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
టీఎస్పీఎస్సీ ప్రతిష్ఠకు భంగం కలిగించాలనే దుర్బుద్ధితో బీజే పీ ఆడిన డ్రామాయే పేపర్ లీకేజీ అన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో పేప ర్ల లీకేజీ ఎపిసోడ్లు కొనసాగుతున్న వి షయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రంలోని రి క్రూట్మెంట్లపై రాబందుల్లా బీజేపీ నే తలు వాలడం బాధాకరమని, విచారణలో అసలు కుట్రదారులు దొరకడం ఖాయమన్నారు. బీజేపీ వలయంలో నిరుద్యోగులు పడొద్దని అన్నారు.