హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి హోదాలో రేవంత్రెడ్డి విదేశాల్లో పర్యటిస్తున్నప్పుడు రాజకీయాలకు అతీతంగా ప్రసంగించాలని, గల్లీలీడర్లా మాట్లాడం తగదని ఎన్నారై బీఆర్ఎస్ యూకే కార్యదర్శి సతీశ్రెడ్డి గొట్టెముక్కల హితవు పలికారు. హైదరాబాద్ గాంధీభవన్లో, గల్లీ కాంగ్రెస్ మీటింగ్లో మాట్లాడినట్టు చిల్లర రాజకీయ విమర్శలు చేయడంపై రేవంత్ క్షమాపణ చెప్పాలని సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గతంలో లండన్ పర్యటనకు వచ్చిన మాజీ మంత్రి కేటీఆర్ ఎంతో హుందాగా ప్రసంగించి ఎన్నారైల్లో స్ఫూర్తి నింపారని గుర్తు చేశారు. సీఎం హోదాలో లండన్ వచ్చిన రేవంత్రెడ్డి.. సోయి లేకుండా కాంగ్రెస్ పార్టీ మీటింగ్లా మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని మండిపడ్డారు.