హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని హైదరాబాద్లోని ట్యాంక్బండ్పై ప్రతిష్ఠించాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ టాడి టాపర్స్ ఫైనాన్స్ కార్పొరేషన్కు ఆదేశాలు జారీ చేసింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ అధికారులతో కలిసి విగ్రహ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని సూచించింది. ఇప్పటికే సర్వాయి పాపన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. తాజాగా ట్యాంక్బండ్పై విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో గౌడ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాయి.
బహుజనవీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ట్యాంక్బండ్పై ప్రతిష్ఠించాలని ప్రభుత్వం నిర్ణయించడంపై ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాతే సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ వైతాళికులు, కళాకారులు, సామాజికవేత్తలు, చరిత్రకారులు, కవులు, సాహితీవేత్తలు, బహుజన పోరాటయోధులకు గుర్తింపు లభిస్తున్నదని పేర్కొన్నారు. అలాగే ట్యాంక్బండ్పై పాపన్నగౌడ్ విగ్రహ ఏర్పాటు చేయాలని నిర్ణయించడంపై సర్వాయి పాపన్న మోకుదెబ్బ రాష్ట అధ్యక్షుడు జకే వీరస్వామిగౌడ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు ట్యాంక్బండ్పై పాపన్నగౌడ్ విగ్రహ ఏర్పా టుకు కృషి చేసిన ఆబ్కారీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్రావుగౌడ్, అశోక్గౌడ్, రాజయ్య గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.