ఘట్కేసర్ రూరల్, డిసెంబర్ 12: తెలంగాణ పల్లెల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని జమ్ముకశ్మీర్ సర్పంచ్లు ప్రశంసించారు. తెలంగాణ పల్లెలు సాధిస్తున్న ప్రగతి దేశానికే ఆదర్శంగా ఉన్నదని కొనియాడారు. సోమవారం జమ్ముకశ్మీర్లోని లఢక్కు చెందిన 35 మంది మహిళా సర్పంచ్లు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ రూరల్ మండలం అంకుషాపూర్ గ్రామ పంచాయతీని సందర్శించారు.గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. పల్లెప్రకృతి వనం, డంపింగ్యార్డు, వైకుంఠధామం, నర్సరీలను సందర్శించారు. చెత్త నుంచి సేంద్రియ ఎరువులు తయారుచేస్తున్న ప్రక్రియను పరిశీలించారు. పంచాయతీ అభివృద్ధికి నిధుల సమీకరణ, పన్నుల వసూళ్లు, పంచాయతీ రికార్డులు, గ్రామసభల నిర్వహణ తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా కార్యక్రమాల గురించి వీరికి జిల్లా సీఈవో దేవసహాయం, డీఎల్పీవో స్మిత, ఎంపీడీవో అరుణ, ఎంపీపీ సుదర్శన్రెడ్డి, సర్పంచ్ జలజ, ఉప సర్పంచ్ బాలమణి తది