హైదరాబాద్ : తొలి తెలుగు బహుజన చక్రవర్తి, సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మహారాజ్ 372వ జయంతి జాతీయ వారోత్సవాలను జయప్రదం చేయాలని సర్దార్ పాపన్న మహరాజ్ ధర్మపరిపాలన సంస్థ (ఎస్పీడీపీవో), జైగౌడ్ ఉద్యమ జాతీయ కమిటీ సంయుక్తంగా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఈనెల 7న రవీంద్రభారతిలో ఉదయం 11గంటలకు నిర్వహించే పాపన్న జయంతి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్గౌడ్ హాజరుకానున్నట్లు ప్రతినిధులు పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏపీలోని మంత్రులతోపాటు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నట్లు కమిటీ ప్రకటించింది.