నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 18 : సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. ఆయా జిల్లాల్లో సర్వాయి పాపన్న విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంసృ్కతికశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ హాజరై నివాళి అర్పించారు. అనంత రం మంత్రి మాట్లాడుతూ.. బహుజన రాజ్యం కోసం జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప మహానీయుడు సర్వాయి పాపన్న అని కొనియాడారు. నిజాం పాలకులకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి బహుజనుల అభ్యున్నతికి కృషి చేశారని, ఆయన బాటలో బహునులు, గౌడ కులస్థులు నడువాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రకాశ్గౌడ్, వివేకానందగౌడ్, విద్యా, మౌలిక సదుపాయాలకల్పన అభివృద్ధిశాఖ సంస్థ చైర్మన్ నాగేందర్గౌడ్, మాజీ మంత్రి రాజేశంగౌడ్, తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ చైర్మన్ పల్లె లక్ష్మణ్గౌడ్, తెలంగాణ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటి చైర్మన్ బాల్రాజ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లాకేంద్రంలో జడ్పీ చైర్పర్సన్ హేమలత, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డితో కలిసి సర్వాయి పాపన్న విగ్రహాన్ని మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆవిష్కరించారు. అనపంతరం నర్సాపూర్లో నిర్వహించిన బైక్ర్యాలీలో ఎమ్మెల్యే మదన్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డితో కలిసి హాజరయ్యారు.
ఆదర్శనీయుడు పాపన్న: మంత్రి గంగుల
సర్వాయి పాపన్నను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లోని సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పాపన్నగౌడ్ పోరాట పటిమను, స్ఫూర్తిగా తీసుకొని ముందుకుసాగాలని పిలుపునిచ్చారు.