తెలుగు యూనివర్సిటీ, అక్టోబర్ 5: పద్మభూషణ్ పురస్కార గ్రహీత శాంతా బయోటెక్ వ్యవస్థాపకుడు డాక్టర్ వరప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో శాంతా-వసంత ట్రస్టు 2023 సాహితీ పురస్కారాలను ప్రకటించింది. ఈ నెల 15న నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో పురస్కార ప్రదానోత్సవం ఉంటుందని ట్రస్టు నిర్వాహకులు తెలిపారు.
అన్నమయ్య సాహితీ పరిశోధకుడు ఆచార్య వేటూరి ఆనందమూర్తికి వరప్రసాద్రెడ్డి ఉత్తమ సాహితీవేత్త పురస్కారం, ప్రముఖ భాషా పండితుడు డాక్టర్ తాడేపల్లి పతంజలి, ప్రముఖ రచయిత్రి డాక్టర్ సీ మృణాళినిలకు శ్రీవేంకరమణారెడ్డి సాహితీ సేవారత్న పురస్కారం ప్రదానం చేయనున్నట్టు పేర్కొన్నారు. ఒక్కొక్కరిని లక్ష నగదుతోపాటు శాలువా, జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో సత్కరించనున్నట్టు తెలిపారు.