ఉప్పల్, ఫిబ్రవరి 27: పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని, చెప్పు, డప్పు వృత్తిదారులకు పెన్షన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏప్రిల్ 13న చలో హైదరాబాద్ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్లోని సుప్రభాత్ హోటల్లో యువసేన రాష్ట్ర అధ్యక్షుడు పొట్టపెంజర రమేశ్ మాదిగ అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్రస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… పారిశుద్ధ్య కార్మికులను తక్షణమే పర్మినెంట్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు.