చిక్కడపల్లి, జనవరి7: పారిశుధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని టీఎస్ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. సోమవారం (నేడు) విద్య, ఉద్యోగ, ఆర్థిక సామాజిక రంగాల్లో మాదిగలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు.