హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా తెలంగాణలో అమలుచేస్తున్న పారిశుద్ధ్య నిర్వహణ చర్యలు బాగున్నాయంటూ కేంద్ర జల్శక్తి మంత్రిత్వ శాఖలోని తాగునీరు, పారిశుద్ధ్య విభాగం కార్యదర్శి విన్నీ మహాజన్ ప్రశంసించారు. న్యూఢిల్లీలోని తన కార్యాలయంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధిశాఖల ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విన్నీ స్పందిస్తూ తెలంగాణలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ కమిషనర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.