హనుమకొండ: లంచాలకు అలవాడు పడ్డ అవినీతి అధికారులు ఏసీబీ వలకు చిక్కుతున్నారు. హనుమకొండ జిల్లాలోని సంగెం తహసీల్దార్ రాజేంద్రనాథ్.. ఓ రైతు వద్ద రూ.40 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. దీంతో ఏసీబీ అధికారులు తహసీల్దారు ఆఫీసుతోపాటు, హనుమకొండ నంది హిల్స్లోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
రెండు రోజుల క్రితం హైదరాబాద్లోని బడంగ్పేట టౌన్ప్లానింగ్ సూపర్వైజర్ ఆకుల అశోక్ ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. ఇంటి నిర్మాణం విషయంలో దేవేందర్ రెడ్డి అనే వ్యక్తి నుంచి రూ.40 వేలు లంచం తీసుకుంటూ అధికారులకు రెడ్హాండెడ్గా చిక్కారు. కాగా, అశోక్.. బుల్లెట్ బండి పాటతో పాపులర్ అయిన విషయం విధితమే.