హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి నియోజకవర్గం పరిధిలోని అధికారులు ప్రొటోకాల్ను పాటించడం లేదని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తెలిపారు. ఈ విషయమై గురువారం ఆయన జిల్లా కలెక్టర్, సీఎస్, అసెంబ్లీ స్పీకర్కు లేఖల ద్వారా ఫిర్యాదు చేశారు. బుధవారం సంగారెడ్డిలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి తాను సరైన సమయానికి చేరుకొన్నా, ప్రారంభించలేదని చెప్పారు.
డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి వచ్చిన తర్వాతే ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టారని పేర్కొన్నారు. దీంతో తన మిగతా కార్యక్రమాలు ఆలస్యమయ్యాయని, చెక్కుల కోసం వచ్చిన లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని తన లేఖలో పేర్కొన్నారు.