సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుధేరా మహిళా డిగ్రీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థినులు తమకు పురుగుల అన్నం పెడుతున్నారని ఆరోపిస్తూ కళాశాల ఆవరణలో ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు విద్యార్థుల వద్దకు వచ్చి ఆరాతీశారు.
నెల రోజుల నుంచి నాణ్యమైన భోజనం లేక ఇబ్బందులు పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని విద్యార్థులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. హాస్టల్లో డాక్టర్ లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించేవారే కరువయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. అనంతరం వారితో కలిసి భోజనం చేసి వెళ్లిపోయారు.
– మునిపల్లి