హైదరాబాద్: ప్రముఖ రియల్టర్, సంధ్య కన్వెన్షన్ ఎంసీ శ్రీధర్రావును పోలీసులు అరెస్టు చేశారు. బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ బంధువులను మోసం చేసిన కేసులో ఢిల్లీ పోలీసులు ఆయనను హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. ట్రాక్టర్లు ఇప్పిస్తానని చెప్పి అమితాబ్ బంధువులను రూ.250 కోట్లు మోసం చేసిన కేసులో శ్రీధర్రావు నిందితుడిగా ఉన్నాడు.
తాము మోసపోయినట్లు గుర్తించిన అమితాబ్ బచ్చన్ బంధువులు ఆయనపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదుచేసి దర్యాప్తుచేపట్టారు. ఇందులో భాగంగా శ్రీధర్ను అరెస్టు చేసి ఢిల్లీకి తరలిస్తున్నారు. కాగా, సంధ్య కన్వెన్షన్ ఎంపీ అరెస్టు కావడం ఇది మొదటిసారిఏమీ కాదు. ఇప్పటికే నాలుగుసార్లు జైలుకెళ్లివచ్చాడు. గతంలో గచ్చిబౌలిలో ఓ ఈవెంట్ మేనేజర్పై దాడి కేసులో, ఆర్గానిక్ ఫుడ్ బిజినెస్ చేస్తున్న ఓ వ్యాపారిని బెదిరించడం వంటి పలు కేసులు ఆయనపై నమోదయ్యాయి.