ములుగు : ఇసుక మాఫియా(Sand mafia) ఆగడాలు రోజురోజుకు శృతిమించి పోతున్నాయి. ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులకు పాల్పడుతూ ప్రాణాలు సైతం తీస్తున్నారు. తాజాగా ములుగు(Mulugu) జిల్లాలో ఇసుక క్వారీ నిర్వాహకులు రైతులపై దాడి చేయడం కలకం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. వెంకటాపురం నూగూరు మండల పరిధిలోని అబ్బాయిగూడెంలో ఇసుక లారీల కారణంగా మిర్చి తోటలు దెబ్బతింటున్నాయని లారీలను రైతులు అడ్డుకున్నారు.
దీంతో ఇసుక సొసైటీ సభ్యులకు, గ్రామస్తులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇసుక క్వారీని నిలుపుదల చెయ్యాలని డిమాండ్ చేస్తూ ప్రధాన రహదారిపై గ్రామస్తులు, రైతులు రాస్తారోకో చేస్తుండగా మహిళలతో పాటు రైతులపై ఇసుక క్వారీ నిర్వాహకులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ మహిళ సొమ్ముసొల్లి పడిపోయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.