హైదారాబాద్/దేవరుప్పుల, సెప్టెంబర్ 13 : జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లిలో నిర్మించ తలపెట్టిన కురుమ సామాజిక భవన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. హైదరాబాద్లో మంత్రి క్యాంపు కార్యాలయంలో కురుమ సంఘం నాయకులు మంత్రిని కలిశారు.
ఈ సందర్భంగా వారు యాదవ సంఘానికి గొర్రెల యూనిట్ల రెండో విడత పంపిణీ, కమ్యూనిటీ హాలు నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ వెంటనే వారికి పది లక్షలు మంజూరు చేయడమే కాక త్వరలోనే గొర్రెల యూనిట్లను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సింగరాజు పల్లి కురుమ సంఘం నాయకులు, కురుమలు పాల్గొన్నారు.