హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 300 జూనియర్ కాలేజీల్లో 599 టాయిలెట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు బుధవారం ఇంటర్ విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ టాయిలెట్లను రూ.2,755 కోట్ల వ్యయంతో నిర్మించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, హనుమకొండ, యాదాద్రి జిల్లాల్లో అబ్బాయిలకు 306, అమ్మాయిలకు 293 టాయిలెట్లను నిర్మిస్తారని తెలిపారు.