అమీర్పేట్, అక్టోబర్ 12: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కే ఓటు వేస్తామంటూ సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ సంఘాల ప్రతినిధులు తీర్మానాలు చేస్తున్నారు. బుధవారం రాత్రి అమీర్పేట్ సిఖ్ ప్రతినిధులు, ఎస్సార్ నగర్ వయోధికుల మండలి ప్రతినిధులు వేర్వేరుగా సమావేశమై తలసానికి మద్దతు ప్రకటించారు.
సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు మద్దతుగా తమ ఓట్లు వేస్తామంటూ ఏకపక్ష తీర్మానాలు చేశారు. సిఖ్ కమిటీ ప్రతినిధులు గురువారం ఉదయం మంత్రి తలసానిని కలిసి తీర్మాన పత్రాన్ని అందజేశారు.