SSC Exams | పదో తరగతి పరీక్షల నిర్వహణలో విద్యా శాఖ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. కూకట్పల్లిలోని న్యూ ఎరా స్కూల్లో చదువుతున్న 80 మంది విద్యార్థులకు అదే పాఠశాలో ఎగ్జామ్ సెంటర్ కేటాయించారు. ఈ విషయం బయటకు రావడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సాధారణంగా ఒక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అదే పాఠశాలలో పరీక్షా కేంద్రం ఇవ్వడం నిషేధం. కానీ ఈ నిబంధనను పట్టించుకోకుండా హైదరాబాద్ కూకట్పల్లిలోని న్యూఎరా పాఠశాలకు చెందిన విద్యార్థులకు అదే పాఠశాలలో ఎగ్జామ్ సెంటర్ కేటాయించారు. ఈ విషయం బయటకు పొక్కకుండా డీఈవో రహస్యంగా ఉంచారు.
హాల్ టికెట్ను ఎవరికీ చూపించకూడదని ఆ 80 మంది విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం సూచించింది. కాగా, మార్కుల కోసమే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యా శాఖ అధికారులు కుమ్మక్కయ్యారని తల్లిదండ్రులు, విద్యా సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనివ్లల విద్యార్థులకు అన్యాయం జరుగుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
పదవ తరగతి పరీక్షల నిర్వహణలో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం
కూకట్పల్లి న్యూ ఎరా స్కూల్లో చదువుతున్న 80 మంది విద్యార్థులకు, అదే స్కూల్లో పరీక్షా కేంద్రం
విషయం బయటికి రాకుండా రహస్యంగా ఉంచిన డీఈవో
హాల్ టికెట్ ఎవరికి చూపించకూడదని విద్యార్థులను ఆదేశించిన పాఠశాల యాజమాన్యం
మార్కుల… pic.twitter.com/GvFHke8OF1
— Telugu Scribe (@TeluguScribe) March 14, 2026