హైదరాబాద్: నగర శివార్లలోని ముచ్చింతల్ శ్రీరామనగరంలో సమతామూర్తి రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాలు ముగిశాయి. దీంతో సమతా కేంద్రం సందర్శనకు భక్తులకు అనుమతించారు. బుధవారం నుంచి ఈ నెల 19 వరకు సమతామూర్తి, 108 దివ్వక్షేత్రాలను ఉచితంగా దర్శించవచ్చని నిర్వాహకులు తెలిపారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6.30 గంటలకు దర్శనానికి అనుమతి ఉంటుందని వెల్లడించారు.
అయితే ప్రస్తుతం రామానుజాచార్యుల స్వర్ణమూర్తి దర్శనానికి అనుమతి లేదని తెలిపారు. అదేవిధంగా సాకేంతిక కారణాలతో త్రీడీ మ్యాపింగ్ షోను తాత్కాలికింగా నిలిపివేస్తున్నామని, త్వరలోనే స్వర్ణమూర్తితోపాటు త్రీడీ లేజర్ షోను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. త్వరలో టికెట్ ధరలను నిర్ణయిస్తామని వెల్లడించారు.