మహబూబాబాద్, జనవరి 23: తన తల్లిదండ్రులకు 40 ఏండ్లకుపైగా సేవ చేసిన వ్యక్తికి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి రూ.1.50 లక్షలతోపాటు మెడలోని బంగారు గొలుసు, ఉంగరాన్ని బహూకరించి సత్కరించారు. మహబూబాబాద్కు చెందిన పర్కాల నారాయణరెడ్డి, జయమ్మకు లక్క రామయ్య పాలేరుగా 40 ఏండ్లకు పైగా సేవలందించారు. నారాయణరెడ్డి రెండేండ్ల క్రితమే మృతిచెందగా, జయమ్మ గతేడాది చనిపోయింది.
తల్లి సంవత్సరీకం సందర్భంగా సోమవారం పర్కాల వెంకట్రెడ్డి తన అన్నలు శ్రీనివాస్రెడ్డి, రవీందర్రెడ్డి, ఉపేందర్రెడ్డి, నరేందర్రెడ్డితో కలిసి రామయ్య ఇంటికి వెళ్లారు. రూ.1.50 లక్షల నగదుతోపాటు తన మెడలో ఉన్న బంగారు గొలుసును రామయ్య మెడలో వేశారు. అంతేగాక తన చేతికి ఉన్న ఉంగరాన్ని తీసి రామయ్య వేలికి తొడిగారు. అనంతరం శాలువాతో ఘనంగా సత్కరించారు.