ఖైరతాబాద్, డిసెంబర్ 8: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు మొదటి తారీఖునే వేతనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ అధికారులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల సంయుక్త పోరాట సమితి చైర్మన్ టీ ప్రభాకర్ కోరారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఐదు శాతం ఉన్న ఐఆర్ను 15 శాతానికి పెంచాలని విన్నవించారు. పీఆర్సీ నివేదికను జనవరి వరకు తెప్పించి 50 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని కోరారు.
ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత వైద్యసేవలు అన్ని కార్పొరేట్ దవాఖానల్లో వచ్చే ఏడాది నుంచి అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ-కుబేర్లో ఉన్న పెండింగ్ బిల్లులన్నీ వెంటనే మంజూరు చేయాలని కోరారు. గచ్చిబౌలి, సచివాలయ ఉద్యోగుల హౌసింగ్ సొసైటీలను రద్దు చేసి అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని, ఐఏఎస్ అధికారిని ప్రత్యేకాధికారిగా నియమించాలని కోరారు. ఈ సమావేశంలో సమితి ప్రతినిధులు రాంశెట్టి, సంజీవరెడ్డి, రవీందర్రెడ్డి, జయేశ్ తదితరులు పాల్గొన్నారు.