హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): బదిలీ అయిన టీచర్ల వేతనాల చెల్లింపులో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించాలని టీఎస్ యూటీఎఫ్ నేతలు కోరారు. బుధవారం హైదరాబాద్లో డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించగా, స్పష్టత వచ్చినట్టు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, ప్రధానకార్యదర్శి చావ రవి తెలిపారు. అక్టోబర్లో బదిలీ అయిన స్కూల్ అసిస్టెంట్లు పాత స్కూళ్లో సెప్టెంబర్ 30 వరకే ఎల్పీసీ తీసుకొని, మళ్లీ అక్టోబర్ 1 నుంచి రిలీవ్ అయిన వరకు నాన్ విత్డ్రాల్ సర్టిఫికెట్ పొందాలని సూచించారు. అక్టోబర్ 1 నుంచి బదిలీ అయిన స్కూల్ నుంచి జీతాలను క్లెయిమ్ చేసుకోవచ్చని వివరించారు.