హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): నష్టాల్లో ఉన్న టీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు సంస్థ ఎండీ సజ్జనార్ ఎన్నో సంసరణలు అమల్లోకి తెచ్చారు. దీంతో ఇప్పటికే పలు డిపోలు లాభాల్లోకి వచ్చాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి మిగిలిన డిపోలనూ లాభాల్లోకి తీసుకురావాలన్న లక్ష్యతో మరిన్ని సంస్కరణల అమలుకు సజ్జనార్ సిద్ధమవుతున్నారు. టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తిచేసుకొన్న సజ్జనార్ ఇప్పటి వరకు తీసుకొచ్చిన, ఇకపై తీసుకురానున్న కీలక సంస్కరణల వివరాలు ఇవీ..