నందికొండ/కేతేపల్లి అక్టోబర్ 10: నాగార్జునసాగర్ రిజర్వాయర్కు శ్రీశైలం నుంచి 1,50,366 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నది. దాంతో సోమవారం 12 క్రస్ట్గేట్లను ఎత్తి 96,696 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మొత్తం 1,47,130 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్నది. సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589.60 అడుగులుగా ఉన్నది.
కాగా, మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి సోమవారం 5,323.03 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. ప్రాజెక్టు 4 క్రస్ట్ గేట్ల ద్వారా 5,140.42 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. కాల్వలకు 481 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు (4.46 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 643.35 అడుగులు (4.03 టీఎంసీలు) ఉన్నట్లు ప్రాజెక్టు ఏఈ ఉదయ్కుమార్ తెలిపారు.