KRMB | శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్వహణకు కేబీఆర్ఎంబీకి అప్పగిస్తూ ఏపీ, తెలంగాణ అంగీకరించాయి. ప్రాజెక్టులపై కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశం బుధవారం సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల ఆపరేషన్కు ఏపీ, తెలంగాణ ఒప్పుకున్నాయి. నీటి వాటాల పంపకం కోసం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయనున్నారు. వాటాల కేటాయింపుపై త్రిసభ్య కమిటీనే తుది నిర్ణయంగా ఉండనున్నది. ఈ సందర్భంగా తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ మాట్లాడుతూ ప్రాజెక్టుల ఆపరేటింగ్ అంతా కేఆర్ఎంబీకి ఇచ్చినట్లు తెలిపారు. పవర్ స్టేషన్స్పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. నాగార్జున సాగర్ తెలంగాణ, శ్రీశైలం ఏపీ చూసుకుంటుందని, ప్రాజెక్టులన్నీ ఇక నుంచి బోర్డు పరిధిలో నడుస్తాయని తెలిపారు.
తమ డిమాండ్లపై అన్ని కేంద్రానికి లేఖలు రాసినట్లు ఈఎన్సీ మురళీధర్ తెలిపారు. ఇంకా అక్కడ నుంచి నిర్ణయం రాలేదని తెలిపారు. నీటి వాటాల పంపకంపై త్రిసభ్య కమిటీనే నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రాజెక్టుల వద్ద భద్రత అనేది పరిస్థితిని భట్టి బోర్డు కనుసన్నల్లో జరుగుతుందన్నారు. కేఈఆర్ఎంబీ పరిధిలో ఉన్న 15 ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి వెళ్తాయన్నారు. ప్రాజెక్టులను పూర్తిగా అప్పగించలేదని.. ఆపరేషనల్, నీటి విడుదల బోర్డు చూసుకుంటుందన్నారు. సీఆర్పీఎఫ్ సైతం కృష్ణా బోర్డు పరిధిలోనే ఉంటాయన్నారు. నిర్వహణ కోసం సిబ్బందిని కేటాయింపు 40: 45 కావాలని కోరుతున్నట్లు తెలిపారు.
ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి మాట్లాడుతూ బోర్డు పరిధిలో మొత్తం 13 ఓటీస్లో తొమ్మిది తెలంగాణ, ఆరు ఆంధ్రప్రదేశ్వి ఉన్నాయన్నారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. ఆపరేషనల్ కోసం ఇరు రాష్ట్రాల నుంచి సిబ్బంది కేటాయింపు ఉంటుందన్నారు. వాటర్ కేటాయింపులపై త్రిసభ్య కమిటీదే తుది నిర్ణమని చెప్పారు. ప్రాజెక్టుల ఆపరేషనల్ ప్రోటోకాల్ త్రిసభ్య కమిటీ అప్పుడున్న పరిస్థితుల్లో తీసుకుంటారని.. లెఫ్ట్ మెన్ కెనాల్ నుంచి రెండు టీఎంసీలు, మార్చి సమయంలో రైట్ మెన్ కెనాల్ నుంచి మూడు టీఎంసీలు ఏపీకి విడుదల చేసేందుకు ఒప్పుకున్నారన్నారు. ఏప్రిల్లో ఐదు టీఎంసీలు ఏపీకి ముందుగానే కేటాయింపులు ఉన్నాయని.. ప్రాజెక్టుల ఆపరేషనల్ కోసం తెలంగాణ ఎప్పుకుందన్నారు.