హైదరాబాద్, అక్టోబరు 25 (నమస్తే తెలంగాణ) : సద్దుల బతుకమ్మ వేడుకలను ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. లాంటౌద్వీపంలో కొత్తగా నిర్మించిన వాటర్ఫ్రంట్ ప్రొమెనేడ్లో తెలుగు ప్రజలంతా పాటలు పాడుతూ ఉత్సాహంగా బతుకమ్మ పండుగను జరుపుకొన్నారు. ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు జయ పీసపాటి మాట్లాడుతూ.. తమ సంస్థ ఆధ్వర్యంలో వరుసగా ఆరో సంవత్సరం బతుకమ్మను నిర్వహించుకోవడం ఆనందంగా ఉన్నదని పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్నా తెలుగు, తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను మరిచిపోవద్దనే ఉద్దేశంతో ఈ పండుగలను నిర్వహిస్తున్నామని చెప్పారు. నవంబర్లో కార్తిక వనభోజనాలు, దీపావళి వేడుకల ఏర్పాట్లకు సన్నాహాలు చేస్తున్నట్టు వివరించారు.
కెనడాలోని క్యాలరీ నగరంలో విజయదశమి, బతుకమ్మ వేడుకలను ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. బోనెస్ క మ్యూనిటీ అసోసియేషన్ హాల్లో క్యాలరీ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో మ హిళలు బతుకమ్మను పేర్చి ఆడిపాడారు. ఈ వేడుకలకు ము ఖ్య అతిథులుగాఅల్బెర్టా ప్రావిన్స్ సాంస్కృతిక శాఖ మంత్రి మహమ్మద్ యాసిన్, డిప్యూటీ మేయర్ వాంగ్ హాజరయ్యారు. పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబర్చిన 20 మంది చిన్నారులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో సుమారు 400 మంది మహిళలు, 250 మంది పురుషులతోపాటు సత్య కొంపల్లి, సుకేశ్ బవండ్ల, అశ్విన్ తుములు, రవి పల్లె, నమ్రత మంగు, రాహుల్ దండే, విష్ణు గబ్బుల, సునీల్ రాజవరం, అనంత్ మంగు, మదన్ చిలువేరి తదితరులు పాల్గొన్నారు.