హైదరాబాద్ : సంక్రాంతి పండుగ వేళ రైతుబంధు సంబురాలు అంబరాన్నంటాయి. రైతుబంధు పతంగులు ఆకాశంలో కనువిందు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంపై హైదరాబాద్ యువత కూడా తమ అభిమానాన్ని చాటుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ఆశీష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో గులాబీ రంగులో ఉన్న పతంగులపై మన కేసీఆర్ – మన రైతు బాంధవుడు అని రాయించారు. ఈ కైట్స్ ను యువత గాల్లో ఎగరవేసి అభిమానాన్ని చాటుకుంటున్నారు. నగరంలోని అనేక బస్తీల్లో రైతుబంధు గాలిపటాలు ఎగురుతున్నాయి.