న్యూఢిల్లీ : కాంగ్రెస్ కొవిడ్ -19 రిలీఫ్ టాస్క్ఫోర్స్ కమిటీ బుధవారం సమావేశం కానుంది. రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షులు, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) నాయకులతో సమావేశమై మహమ్మారి పరిస్థితి, పార్టీ తరఫున చేపట్టాల్సిన సహాయక చర్యలపై చర్చించనుంది. ఈ సమావేశం బుధ, గురువారాల్లో వర్చువల్ విధానంలో జరుగనుంది. సమావేశానికి ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ అధ్యక్షత వహించనున్నారు. కాంగ్రెస్ పాలించే రాష్ట్రాల్లో COVID-19 పరిస్థితిపై టాస్క్ఫోర్స్ చర్చించే అవకాశం ఉంది. టాస్క్ఫోర్స్ సభ్యుల్లో ప్రియాంక గాంధీ వాద్రా ఉన్నారు.