హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన నాటి నుంచి తెలంగాణ సర్వతోముఖాభివృద్ధితో దూసుకుపోతున్నది. కేవలం ఏడేండ్ల కాలంలోనే అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించింది. ఈ పురోగతికి సంబంధించిన సమాచారాన్ని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంవో) ప్రజా సంబంధాల విభాగం విడుదల చేసింది. ప్రజా సంక్షేమం, వ్యవసాయం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభ్యున్నతి, నీటిపారుదల, విద్యుత్తు, పారిశ్రామిక, సమాచార సాంకేతిక, ఆర్అండ్బీ, విద్య, హోం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ, సాంస్కృతిక, క్రీడలు, జీహెచ్ఎంసీ, పరిపాలనా విభాగం, పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్టీసీ , సింగరేణి, ఉద్యోగుల సంక్షేమం, టీఎస్పీఎస్సీ, మహిళా, శిశు సంక్షేమం, డబుల్ బెడ్రూం ఇండ్లు, మిషన్ భగీరథ, హరితహారం, తెలుగు భాషాభివృద్ధి, కొవిడ్ కట్టడి, తెలంగాణ భాషా సాంస్కృతిక వికాసం తదితర అంశాలకు సంబంధించిన ప్రగతి సమాచారాన్ని ఇందులో పొందుపర్చారు. ఈ సమాచారం ‘నమస్తే తెలంగాణ’ వెబ్సైట్లో అందుబాటులో ఉంది.